లక్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.కొంతమందికి అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినా వారు ఉన్నారు.
అలానే దురదృష్టం వస్తే కూడా కోట్ల సంపదను కూడా రాత్రికి రాత్రి పోగొట్టుకుని దురదృష్ట వంతులు కూడా మన సమాజంలో ఉన్నారు.అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.
అలా ఎవరి లైఫ్ లో ఎప్పుడు అదృష్ట దేవత వస్తుందో తెలియదు.అలానే ఈ వృద్ధ దంపతులకు కూడా అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది.ఈ వయసులో వారికీ ఇంతటి అదృష్టం రావడంతో వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ వృద్ధ దంపతులకు వచ్చిన అదృష్టం ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈ దంపతులకు రోజు వాకింగ్ చేయడం అలవాటు.
అలానే ఆ రోజు కూడా వాకింగ్ కు వెళ్లారు.
కానీ రోజులగా కాకుండా వారికీ ఆ రోజు అదృష్టం కలిసి వచ్చింది.వాళ్ళు వాకింగ్ చేస్తుండగా వాళ్లకు పసుపుపచ్చ కలర్ లో ఉన్న ఒక రాయి కనిపించింది.ముందుగా వాళ్ళు ఆ రాయిని రంగు రాయి అనుకున్నారు.కానీ కొంచెం అనుమానంగా ఉంటే ఆ రాయిని తీసుకువెళ్లి పార్క్ మేనేజ్మెంట్ కు ఇచ్చారు.
అయితే ఈ రాయి సాదా సీదా రంగు రాయి కాదని విలువైనా డైమెండ్ గా గుర్తించారు.ఈ పసుపురంగు డైమెండ్ ను పార్క్ మేనేజ్మెంట్ ఆ దంపతులకు ఇచ్చేసారు.దాని విలువ 11 లక్షల నుండి 65 లక్షల వరకు ఉండవచ్చని అభికారులు చెబుతున్నారు.మొత్తానికి వారికీ అనుకోకుండానే అదృష్టం కలిసి వచ్చింది.వాకింగ్ కోసం అని వెళ్లి వజ్రం దొరకడం తో ఆ వృద్ధ దంపతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.