బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అరెస్టయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఎన్సీబీ మెస్ నుంచి లభించే ఆహారపదార్థాలను తింటున్నారు.
ఒక స్టార్ హీరో కొడుకు హోదాలో ఉన్న ఆర్యన్ అక్కడి భోజనం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన వారి తల్లిదండ్రులు అతనికి ప్రత్యేకమైన భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అధికారులు అందుకు ఒప్పుకోలేదు.ఈ క్రమంలోనే ఆర్యన్ ఎన్సీబీ మెస్ నుంచి పంపించే ఆహారాన్ని తీసుకుంటున్నారు.
ఇకపోతే కొడుకు అరెస్ట్ అయిన తర్వాత తన తల్లి గౌరీఖాన్ తన కొడుకుకు ఎంతో ఇష్టమైన మెక్డోనాల్డ్స్ బర్గర్ తినిపించాలని ఆశపడినా, ఆమెకు కూడా అధికారుల నుంచి తీవ్ర నిరాశ ఎదురైంది.భద్రతా లోపం కారణంగా బయట నుంచి తీసుకు వచ్చే ఆహార పదార్థాలను లోపలికి అనుమతించమని అధికారులు చెప్పడంతో ఆమె ఎంతో నిరాశగా వెనుతిరిగారు.
ప్రస్తుతం ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉంటూ ఇంటరాగేషన్ కి సహకరిస్తున్న ఆర్యన్ ఖాన్ కోరికమేరకు తనకు కొన్ని పుస్తకాలను అధికారులు అందించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఫోన్ ను గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించగా అక్కడ ఫోన్ లో ఉన్న డేటాను ట్రేస్ చేయడంతో పలు షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.ఆర్యన్ డ్రగ్స్ మాత్రమే కాకుండా తన ఫోన్ లు కొన్ని అసభ్యకర ఫోటోలు అశ్లీల చిత్రాల వీడియోలు ఉండడంతో అధికారులు షాకయ్యారు.
ఇలా ఆర్యన్ గురించి ఒక్కొక్కటిగా బయటపడుతుడడంతో ఈ కేసు ఆర్యన్ ఖాన్ మెడకు ఉచ్చు బిగుసుకుందని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా అక్టోబర్ 5వ తేదీ అధికారుల అనుమతితో షారుక్ ఖాన్ ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్నటువంటి తన కొడుకును కలవడానికి వెళ్లారు.ఈ క్రమంలోనే తన తండ్రిని చూసిన ఆర్యన్ బోరున విలపించాడు.
మరి ఈ కేసులో ఆర్యన్ ఏ విధంగా బయటకు వస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.