స్టార్ హీరోయిన్ సమంత సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్ గా, రొమాంటిక్ కపుల్ గా చైసామ్ జోడీ పేరు సంపాదించుకున్నారు.2017 సంవత్సరంలో అక్టోబర్ 6, 7వ తేదీలలో రెండు సంప్రదాయాలలో చైసామ్ ల వివాహం ఘనంగా జరిగింది.ఈ జోడీ నాలుగో వివాహ మహోత్సవం జరుపుకుంటారని అందరూ భావించిన సమయంలో విడిపోతున్నట్టు ప్రకటన చేసి అందరికీ షాకిచ్చారు.
అయితే సంవత్సరం క్రితం పెళ్లి రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చైతన్యతోకలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు అందులో నేను నీ దానిని.
నువ్వు నా వాడివి.ఏ పరిస్థితులు ఎదురైనా కలిసికట్టుగా ఉంటూ ఆ పరిస్థితులను ఎదుర్కొందామని ఆహ్వానిద్దామని హ్యాపీ ఆనివర్సరీ హస్బెండ్” అంటూ సమంత పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు మాత్రం సమంత చైతన్య కలిసి విడిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.సంవత్సరం క్రితంచైతన్య సమంతల మధ్య ఎంతో ప్రేమ, అభిమానాలు ఉండేవని ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య దూరం మాత్రమే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చైసామ్ తీసుకున్న కఠిన నిర్ణయం తమను ఎంతో బాధ పెడుతోందని నెటిజన్లు చెబుతున్నారు.
చైసామ్ తమ హృదయాలను ముక్కలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.వీళ్లిద్దరూ విడిపోవడానికి చాలా కారణాలు ప్రచారంలోకి వస్తున్నా నిజం ఏమిటో చైతన్య సమంతలకు మాత్రమే తెలుసని చెప్పవచ్చు.విడాకుల నిర్ణయం చైతన్య సమంతలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.