ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా ఒక యజ్ఞం లా ముందుకు వెళుతుందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నటారని నా వంతుగా మూడు విడతల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నటానని అన్నారు.
పర్యావరణానికి మేలు కలిగేలా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ దసరా సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఊరు ఉరుకో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం చేపట్టడం చాలా గొప్పదని కొనియడారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఈ చాలెంజ్ తనను అభిమానించే జనరల్ పబ్లిక్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆర్పీ.పట్నాయక్ పిలుపునిచ్చారు.