సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా విడుదల కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా దసరా రేస్ లోనే రాబోతుందని ఇప్పటి వరకు అభిమానులంతా అనుకున్నారు.
కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండడంతో దసరా సీజన్ లో రావడం కష్టంగానే కనిపిస్తుంది.దసరా రేస్ లోకి రావాలంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలి.
కానీ ఈ సినిమా ఇంకా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ నెలాఖరుకి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.
ఈ నెలాఖరున సినిమా పూర్తి అయినా కూడా ఈ సినిమా దసరా సీజన్ లో విడుదల చేయవచ్చు.కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే సంక్రాంతి బరిలోకి మూడు పెద్ద సినిమాలు ఉన్నారు.
మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు విడుదల అవ్వబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ మూడు సినిమాలో 12, 13, 14 తేదీలను బ్లాక్ చేసి విడుదలకి సిద్ధంగా ఉంచుకున్నారు.ఇక బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం అఖండ సినిమా సంక్రాంతి రేస్ లోకి వస్తే ఈ మూడు తేదీలలో ఒక తేదీని ప్రకటిస్తారా లేదంటే కొత్త తేదీలో రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి గుమ్మడి కాయ కొట్టే రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని సమాచారం.మరి మొత్తానికి బాలకృష్ణ అంత పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లోనే అఖండ సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నాడు.మరి ఈ సినిమాలు పోటీ తట్టుకుని బాలయ్య అఖండ సినిమా ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.