చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.అయితే సెలబ్రిటీలు మాత్రం ఖరీదైన కార్లను ఎక్కువగా ఇష్టపడతారు.
ప్రముఖ కంపెనీలకు చెందిన కొత్త మోడల్ కార్లు మార్కెట్ లోకి వస్తే వెంటనే కొనుగోలు చేయడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపుతుంటారు.ఈ మధ్య కాలంలో పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెర్సిడెజ్ కారును కొనుగోలు చేశారు.రామ్ చరణ్ కొనుగోలు చేసిన కారు కష్టమైజ్డ్ వెర్షన్ కావడం గమనార్హం.
మరో స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారు.లాంబోర్ఘిని గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ఎన్టీఆర్ కొనుగోలు చేయగా ఈ కారు ధర ఏకంగా 3.16 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరైన స్టార్ హీరో ప్రభాస్ సైతం కొన్ని రోజుల క్రితం కొత్త కారును కొనుగోలు చేయడం గమనార్హం.
ప్రభాస్ కొనుగోలు చేసిన కారు ధర ఏకంగా ఆరు కోట్లు కాగా లాంబోర్ఘిని అవెంటరాస్ రోడ్ స్టర్ కారును ప్రభాస్ కొనుగోలు చేశారు.ఒకవైపు స్టార్ హీరోలు కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటే మరోవైపు స్టార్ హీరోయిన్లు సైతం కొత్త కార్లపై ఆసక్తి చూపుతున్నారు.
కోలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన శివానీ నారాయణన్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.ఈ హీరోయిన్ కొన్న కారు ధర ఏకంగా కోటీ 20 లక్షల రూపాయలు కావడం గమనార్హం.మరో హీరోయిన్ రమ్య పాండియన్ బీఎండబ్ల్యూ జీటీ కారును కొనుగోలు చేశారు.ఈ కారు ఖరీదు 68 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.