1.భారత విమానాలపై కెనడా నిషేధం ఎత్తివేత
భారత ప్రయాణికులకు కెనడా తీపి కబురు చెప్పంది.భారత విమానాలపై నిషేధాన్ని తొలగించింది.
2.న్యూజెర్సీలో తెలంగాణ విమోచన దినం
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా న్యూ జెర్సీ హౌజ్ ఆఫ్ బిర్యానీ అండ్ కబాబ్స్ రెస్టారెంట్ లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి సభ్యులు సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రవాస తెలంగాణ వారు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరుల నివాళులర్పించి , తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
3.ఈ సెక్యూరిటీ లో చైనా కంటే భారత్ బెటర్
ఇంటర్నెట్ స్పీడ్ లో భారత్ వెనుకంజలో ఉంటే ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విషయంలో దక్షిణాసియాకు చెందిన ఎనిమిది దేశాల కంటే ప్రథమ స్థానంలో ఉంది.ఈ ఈ విషయంలో చైనా కంటే భారత్ మెరుగ్గా ఉంది.
4.అఫ్గాన్ లో మీడియా పై కఠిన ఆంక్షలు
ఆఫ్ఘనిస్తాన్ లో మీడియా పై కఠిన ఆంక్షలు విధించారు.11 నియమాలు పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు.
5.తొలి డిఎన్ఎ టీకా భారత్ దే
ప్రపంచంలో తొలి డీఎన్ఏ కరోనా వ్యాక్సిన్ ‘ జైకోవ్ – డి ‘ ని భారత్ అభివృద్ధి చేసిందని, దీనిని 12 ఏళ్లు నిండిన వారు అందరికీ ఇవ్వొచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో ప్రకటించారు.
6.కువైట్ లో యజమాని గన్ తో కాల్చుకున్న భారత వ్యక్తి
గల్ఫ్ దేశం కువైట్ లో భారత వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.స్వదేశం లో ఉన్న తన భార్యతో ఫోన్ మాట్లాడుతూ పక్కనే ఉన్న యజమానితో తనను తాను కాల్చుకోవడంతో తీవ్రంగా గాయలపాలయ్యడు.బాధితుడి వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
7.అమెరికా లో హిందూ మాసంగా అక్టోబర్
అమెరికాలో హిందూ మాసంగా అక్టోబర్ ను గుర్తిస్తున్నట్టు అమెరికాలోని టెక్సాస్ , ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహాయో తో పాటు అనేక నగరాలు తీర్మానం చేసి గవర్నర్ కు పంపించాయి.
8.స్వీడన్ లో అమెరికా రాయబారిగా భారత సంతతి వ్యక్తి
అమెరికా అధ్యక్షుడు గా జో బైడన్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు దక్కుతున్నాయి తాజాగా తన చిరకాల మిత్రుడు అనుచరుడైన భారత సంతతికి చెందిన ఎరిక్ రామనాథన్ ను స్వీడన్ లో అమెరికా రాయబారిగా నియమించారు.
9.కువైట్ ను వదిలి వెళ్ళిన వారిలో భారతీయులే టాప్
కువైటైజేషన్ పాలసీ కి తోడుగా కరోనా కూడా చేరడంతో, గత ఏడాది గా భారీ సంఖ్యలో ప్రవాసీయులు కువైట్ వదిలి వెళ్ళిపోతున్నారు.కువైట్ లేబర్ మార్కెట్ గడిచిన ఏడాది కాలంలోనే ఏకంగా సుమారు 2 లక్షల మంది ప్రవాస కార్మికులను కోల్పోయినట్లు లెక్కలు బయటకి వచ్చాయి.
10.ట్రంప్ హయాంలో ఎన్ని హెచ్ వన్ బీ వీసాలు తిరస్కరణకు గురయ్యాయి అంటే
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత 2020 సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో హెచ్ – 1 బీ వీసా దరఖాస్తుల్లో 28.6 శాతం తిరస్కరణకు గురయ్యాయి.ఈ విషయాన్ని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ సంస్థ వెల్లడించింది.