కొన్ని విషయాలను మనం ఏం తెలుసుకోకుండానే అనేసుకుంటాం.కానీ అసలు విషయం ఏంటి అనేది మాత్రం వాళ్ళను కలిసి మాట్లాడితేనే తెలుస్తుంది.
అలాగే మెగాస్టార్ అనగానే కోట్లకు కోట్లు సంపాదించాడు.ఎవరికేం పెట్టాడు.
ఫ్రెండ్స్ కి ఇచ్చాడు అని.కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆయనకు మంచి చేసిన వాళ్ల గురించే చెప్తాడు గానీ, హాని చేసిన వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పాడట.
దీనికి ఉదాహరణ.ఆయన విజయరాఘవా చారి రోడ్డులో సుధాకర్, హరి ప్రసాద్ లతో ఉన్న కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది.అవన్నీ కూడా ఆయన చాలా సరదాగా చెప్తారట.అప్పట్లో వాళ్లకు ఏదైనా ఆడిషన్ కి వెళ్ళాలంటే కనీసం మంచి చొక్కా కూడా ఉండేది కాదట.
ఒకవేళ ముగ్గురిలో ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్లు వేసుకునే వారట.అంటే నీది నాది అనే తేడా లేకుండా కలిసి మెలిసి ఉండేవారట.
అయితే ఆ ముగ్గురిలోనూ చూస్కుంటే హరి ప్రసాద్ కొంచెం అతి తెలివి కలిగిన వ్యక్తి.ఎవరైనా ఆ ముగ్గుర్నీ ఆడిషన్ కి రమ్మని పిలిస్తే.ఆ విషయం వాళ్లకు చెప్పకుండా.వాళ్ళు ఊర్లో లేరని అబద్ధం చెప్పేవాడట.అంతే కాకుండా మళ్ళీ ఈ అవకాశం వాళ్లకు ఎక్కడ దక్కుతుందో అని తానొక్కడే వెల్లేవాడట.శివరంజని సినిమాలో అలానే హీరో ఛాన్స్ కొట్టేశాడని, అది కూడా సరదాగా చెప్పే వారట చిరంజీవి.
ఇక సుధాకర్ కూడా వాళ్ళలో ఎవరికి అవకాశం వచ్చిన ఒకటే అని భావించేవాడే గానీ, ఆ రోజూ హరి ప్రసాద్ ఇలా చేశాడే అని అనుకోడని చెప్పేవారట.
ఇలా హరిప్రసాద్ చేతిలో చిరంజీవి దారుణంగా మోసపోయినపటికి ప్రస్తుతం తన నటనా నైపుణ్యంతో మెగా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.