ఈరోజు ఉదయం రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు వార్తలు అధికారిక వర్గాలు తెలియజేసిన సంగతి తెలిసిందే.అయితే ఉన్నట్టుండి ఈ రోజు సాయంత్రం.
ఈ పర్యటన రద్దయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.విషయంలోకి వెళితే కాలు బెనకడం తో సీఎం జగన్.
పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందట.ఈ రోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా కాలు బెనకడం తో… సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో.
జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సీఎం జగన్ కి బదులు హోం మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో.మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో .కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి.
అదేవిధంగా శాంతిభద్రతలకి సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. సీఎం జగన్ రేపు వెళ్లాల్సి ఉండగా ఒక్క సారిగా ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో.
ఏపీ మీడియా సర్కిల్ లో ఈ వార్త సంచలనంగా మారింది.