ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీల మరియు సామాన్య ప్రజలకు దూరం బాగా తగ్గిపోయింది.దీనికితోడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్ చాట్, తదితర సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు.
దీంతో సినీ సెలబ్రిటీలు కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అభిమానులకి బాగానే దగ్గరవుతున్నారు.ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సెలబ్రెటీలపై అసభ్యకర కామెంట్లు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారు.
కాగా తాజాగా తమిళ ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ కి సోషల్ మీడియాలో ఓ చేదు అనుభవం ఎదురైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్యకాలంలో నటి అమలా పాల్ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంది.దీంతో తాజాగా నటి అమలా పాల్ క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో ఓ ఆకతాయి ఈ ఫోటోపై స్పందిస్తూ ఆమె యొక్క ఎద భాగాలు కనిపిస్తున్నాయని అసభ్యకరంగా మెసేజ్ చేశాడు.దీంతో అమలా పాల్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ “అవును కనిపిస్తున్నాయి” అయితే ఏంటి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
అంతేకాకుండా ప్రస్తుత జనరేషన్ లో ప్రతి ఒక్కరూ ఆడపిల్ల ఎలా బట్టలు ధరించాలి, ఎలా ప్రవర్తించాలి, అనే విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ తమకంటూ ఒక జీవితం ఉందని మరిచిపోతున్నారని కాబట్టి ప్రక్క వారిపై పెట్టేటువంటి శ్రద్ధ తమ జీవితం బాగుపదెందుకు పెడితే బాగుంటుందని తెలియజేసింది.దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.
అయితే ఈ విషయం ముందు ఇలా ఉండగా ఇటీవలే అమలా పాల్ తెలుగులో “ఆమె” అనే తమిళ రీమేక్ చిత్రంలో నటించింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మధ్య నటి అమలా పాల్ కేవలం చిత్రాలలో మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతోంది.ఈ క్రమంలో ఇటీవలే “కుడి ఎడమైతే” అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ నటి అయిన “ఆహా” లో ప్రసారమవుతుంది.