ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తమ సేవలను భారత్ లో మరింత విస్తరించేందుకు గత ఏడాదిలో పేమెంట్స్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా వినియోగదారులకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ డెవలపర్లు కృషి చేస్తున్నారు.
అందులో వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే ఇండియన్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇచ్చేందుకు వాట్సాప్ రంగం సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉండడంతో త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఈ ఫీచర్ వినియోగించి భారతదేశం లోని యూపీఐ పేమెంట్స్ మాత్రమే యూజర్లు చేయగలరని, అది కూడా అందులో రూ.10 క్యాష్ బాక్ ఒక్కసారే పొందగలరని, పేమెంట్స్ చేసిన యూజర్లకు 48 గంటల్లోనే ఆ క్యాష్ బ్యాక్ లభిస్తుందని, ఈ ఫీచర్ అధికారికంగా ప్రకటించిన తర్వాత క్యాష్ బ్యాక్ అమౌంట్, క్యాష్ బ్యాక్ సంఖ్య మారే అవకాశం ఉందని వాబిటా ఇన్ఫో నివేదిక తెలిపింది.
కాగా వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ లో వాట్సాప్ చాట్ విండో టాప్ ప్లేసులో కొత్త క్యాష్ బ్యాక్ బ్యానర్ ను వాబిటా ఇన్ఫో నివేదిక ఇప్పటికే ఒక స్క్రీన్ షార్ట్ తీసి పోస్ట్ చేసింది.
అందులో ” మీ తదుపరి పేమెంట్స్ పై క్యాష్ బ్యాక్ పొందండి అని, ప్రారంభించడానికి బ్యానర్ పై క్లిక్ చేయండి అని ఉంది.అయితే వాట్సాప్ ను ఉపయోగించి మొదటి పేమెంట్స్ చేసే వినియోగదారులు మాత్రమే క్యాష్ బ్యాక్ పొందుతారా.? లేకపోతే గతంలో పేమెంట్స్ జరిపిన యూజర్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందా అనే అంశం పై క్లారిటీ లేదు.
వాట్సాప్ త్వరలో ఇంకో కొత్త ఫీచర్ని తీసుకురావడానికి సిద్ధ మవుతుంది.గ్రూప్ ఇమేజస్ గా మార్చేందుకు వీలుగా ఎమోజి, స్టికర్ లను ఐకాన్ ఎడిటర్ ఫీచర్ గా తీసుకు రానుంది.ఇవన్నీ టెస్టింగ్ దశలో ఉండడంతో బీటా యూజర్లు కూడా వీటిని యాక్సెస్ చేయలేరు.అయితే వాట్సాప్ లోని మెసెంజర్ రూమ్ లు, ఫేస్ బుక్ లో గ్రూప్ కాల్ లో చేరడానికి 50 మంది యూజర్లను అనుమతించింది.
దీంతో ఈ ఫీచర్ పై సర్వత్రా అసంతృప్తే వ్యక్తం అవ్వడంతో వాట్సాప్ చాట్ షేర్ షీట్ నుంచి ” మెసెంజర్ రూమ్స్” షార్ట్ కట్ ను తొలగించనుంది.అందులో భాగంగానే వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్ 2.21.190.11 లో మెసెంజర్ రూమ్ ఫీచర్ ను తొలగించింది.అలాగే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.19.15 కూడా ఈ ఫీచర్ ను తొలగించనుంది.