ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.రాబోయే ఎన్నికలలో బీజేపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.
ఏపీ దేవాదాయ శాఖనీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.దేవాలయాల బాధ్యతను పూర్తిగా ప్రముఖ సంస్థలకు అప్పగిస్తామని.
కాకినాడలో మీడియా విలేకరులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి నీ రాజకీయ ప్రయోజనాల కోసం.
వాడు కుంటున్నట్లు ఆరోపణలు చేశారు.ఈ విషయంలో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రత్యేక ఆహ్వానితులు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత్రలతోనే తిరుమల కొండ నిండిపోతుంది అని సీరియస్ అయ్యారు.ప్రత్యేక ఆహ్వానితులు లిస్టులో పలువురు కళంకితులు కూడా ఉన్నారని.మీడియా సమావేశంలో సోము వీర్రాజు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు లిస్ట్ విషయంలో న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడం తెలిసిందే.ఈ తరుణంలో బీజేపీ- జనసేన కూటమి.
అధికారంలోకి రాగానే ఏపీ దేవాదాయ శాఖ రద్దు చేస్తాం అని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.