ప్రజలకు శాంతిభద్రతలు కల్పించే విషయంలో పోలీస్ వ్యవస్థ నిరంతరం కంటిమీద కునుకకు లేకుండా శ్రమిస్తుంది.కొత్త తరహా మోసాలకు ప్రజలు బలైపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తుంది.
ఇక ఇప్పటి టెక్నాలజీ యుగానికి తగ్గట్టు దేశంలో పలు రాష్ట్రాల పోలీసులు కూడా అన్ని రకాల సోషల్ మీడియా వేదికలలో చురుగ్గా పనిచేస్తున్నారు.అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటూ ప్రజలను ఎప్పటి కప్పుడు అలర్ట్ చేస్తూ మోసాల బారిన పడకుండా కాపాడుతున్నారు.
కాగా ఇలాంటి పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్ పోలీసులు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు.
వీరు ట్రెండ్కు తగ్గట్టు సరికొత్త విధానంలో దూసుకుపోతున్నారు.
మొన్నటికి మొన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్ను కూడా హెల్మెట్ అవగాహనలో వాడేశారు.ఇలా ఎప్పటికప్పునడు సినిమా వాళ్లకు సంబంధంచిన వీడియోలను వాడేస్తుంటారు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్న సుఖీభవ మీమ్ను వీరు సరికొత్తగా వాడేశారు.నల్లగుట్ట శరత్ అనే యువకుడు డ్యాన్సు చేసే క్రమంలో టీ పౌడర్ యాడ్ను ఇమిటేట్ చేస్తూ ఇరగదీశాడు.
దీంతో అది కాస్తా అన్ని విషయాల్లోనూ వాడేస్తున్నారు చాలామంది.
ఇక ఇప్పుడు దీన్ని ప్రైజ్మనీ గెలిచారని, లేదంటే కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ వచ్చే లింకుల విషయంలో అప్రమతత్ంగా ఉండాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ సుఖీభవ మీమ్ను తమదైన స్టైల్ లో వాడేశారు.ఇలాంటి మోసపూరిత లింక్స్ ను అస్సలు ఓపెన్ చేయకండి’ అంటూ ఆ టీ పౌడర్ యాడ్లోని స్క్రీన్ షాట్ ట్విట్టర్ వేదికగా పరిచయం చేస్తూ అవగాహన కల్పించారు.మోసపూరిత లింక్స్ను వద్దమ్మా అనే పోస్టర్తో భలే హైలెట్ చేశారు.
దీంతో ఆ మీమ్ ఇప్పుడు ఓవర్నైట్ లో సెన్సేషన్ అయిపోయింది.దీనికే కాకుండా చాలా విషయాల్లో ఈ మీమ్ విపరీతంగా ట్రోలింగ్కు గురవుతోంది.