వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కీలక పార్టీలు.గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని ఎలాగైనా ఓడించటానికి దేశంలో ప్రతిపక్షాలన్నీ కలసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దేశంలో బీజేపీ ని ఎలాగైనా దెబ్బ కొట్టే రీతిలో బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగానే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు మీటింగ్ పెట్టిన టైం లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గోవాలో అధికారంలో బిజెపి ఉండగా ప్రతి పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
కాగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర ఆశించినస్థాయిలో పోషించు కుండా ఉంటున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే.ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా.గోవా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అంత మాత్రమే కాక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్… గోవాలో కూడా.మమతా బెనర్జీ పార్టీ కి వ్యూహకర్తగా పని చేయడానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలో ఇప్పటినుండే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.గోవాలో పర్యటిస్తూ ఉన్న.
తరుణంలో మమతా బెనర్జీ కూడా పర్యటించి.బీజేపీని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు.