ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికైన నాటినుండి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావడం తెలిసిందే.ప్రపంచంతో పోటీ పడే రీతిలో రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి.
పాఠశాల నుండే అటువంటి వాతావరణం కల్పించేలా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకురావటం జరిగింది.అంత మాత్రమే కాక చదువు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా.
అమ్మ ఒడి అదే రైతుల జగనన్న గోరుముద్ద వంటి పథకాల ద్వారా ఆదుకుంటున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా కూడా పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ లు.అందిస్తున్నారు.ఇదిలా ఉంటే మహమ్మారి కరోనా వైరస్ రావడంతో.
చాలా వరకు విద్యా విధానం ఆన్ లైన్ అయిపోయింది.
ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఉండే విద్యార్థులకు.ఈ విద్యా విధానం విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం తో పాటు ముందుగా ఆ ప్రాంతాలలో నెట్వర్క్ లేని పరిస్థితి ఉండటంతో గిరిజన విద్యార్థుల కోసం.జగన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేయడం జరిగింది.విషయంలోకి వెళితే రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 1529 టెలికాం టవర్లను జియో సంస్థ చేత ఏర్పాటు చేయించింది.4g నెట్వర్క్ పరిధిలోకి అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పెద్ద బయలు, జీకే వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు హైస్పీడ్ 4జి సేవలు జగన్ ప్రభుత్వం jio తో కలిసి పని చేయడానికి పూనుకుంది.ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు నెట్వర్క్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో వారి విద్య కి ఎటువంటి అంతరాయం కలగకుండా.
విద్య కొనసాగించేలా.జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
తాజా వార్తలు