మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.సెప్టెంబర్ 25 వ తారీఖున జరగనున్న ఈ ఈవెంట్ భారీ ఎత్తున జరపాలని.
ఈ సినిమా యూనిట్ భావిస్తోంది.పొలిటికల్ నేపథ్యంలో… ఈ సినిమా తెరకెక్కింది ఇటీవల విడుదలైన టీజర్ బట్టి అర్థమవుతుంది.
సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు.సెప్టెంబర్ 22వ తారీకు చిరంజీవి రిలీజ్ చేసిన టీజర్ కి.భారీ రెస్పాన్స్ రావడం జరిగింది.
కాగా డైరెక్టర్ దేవకట్ట ఈసారి చాలా గట్టిగా కాన్సెంట్రేషన్ పెట్టి సినిమా తీసినట్లు సినిమాలోని డైలాగులు టేకింగ్ బట్టి అర్థమవుతుంది.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించగా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ కార్యక్రమానికి.
పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు వార్తలు రావటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇటీవలె ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.