పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు మన దేశంతో పాటు విదేశాలలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ప్రభాస్ సినిమాలు విడుదలైతే కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
ఈశ్వర్ సినిమా ప్రభాస్ కు తొలి సినిమా కాగా అభినవ్ కృష్ణ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభికి కూడా ఆ సినిమా తొలి సినిమా అనే విషయం తెలిసిందే.బాహుబలి సినిమాకు అదిరే అభి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.
ఒక ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ ఈశ్వర్ సినిమా చేసిన సమయంలో ప్రభాస్ గారికి ఫోన్ చేసి భయ్యా సినిమా చూశారా అని అడగగా లేదు నేను రేపు చూద్దామని అనుకుంటున్నానని ప్రభాస్ సమాధానమిచ్చారని తాను కూడా ఈరోజు చూడలేదు రేపు చూద్దామని అనుకుంటున్నానని ప్రభాస్ కు చెప్పానని అదిరే అభి కామెంట్లు చేశారు.మా ఇంట్లో అందరూ ఈశ్వర్ సినిమా చూసి నీ యాక్టింగ్ బాగా నచ్చిందని చెప్పారని అదిరే అభి వెల్లడించారు.
ఈశ్వర్ సినిమా తర్వాత భారీగా ఆఫర్లు వస్తాయని భావించినా అలా జరగలేదని అదిరే అభి పేర్కొన్నారు.
అయితే జబర్దస్త్ షో కెరీర్ కు ప్లస్ అయిందని అదిరే అభి వెల్లడించారు.తనకు పేరు కంటే రెమ్యునరేషన్ ముఖ్యం కాదని అదిరే అభి పేర్కొన్నారు.మంచి క్యారెక్టర్ ఇవ్వాలని తాను కోరుకుంటానని అభి అన్నారు.
నార్త్ ఇండియాలో ప్రభాస్ ను గ్రీక్ గాడ్ లా చూస్తున్నారని అభి తెలిపారు.
ప్రభాస్ ఈశ్వర్ లో ఎలా జోవియల్ గా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని అభి కామెంట్లు చేశారు.
బాహుబలి సమయంలో చాలా విషయాలు ప్రభాస్ తో మాట్లాడానని అదిరే అభి తెలిపారు.