కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.అంతేకాకుండా చాలా మంది నిరు పేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు తిండి తిప్పలు లేక ఆకలితో అలమటించారు.
దీంతో టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు విలన్ “సోనూ సూద్” స్పందిస్తూ కొన్ని లక్షల మందికి సహాయం అందించాడు.
అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో కొంత మంది విద్యార్థులు తమ కాలేజీ ఫీజులను కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో సోనూ సూద్ స్వయంగా తన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థుల కష్టాలను తీర్చాడు.
కాగా ఇటీవలే నటుడు సోనూ సూద్ ఇంటిపై మరియు ఫౌండేషన్ పై ఇన్ కమ్ టాక్స్ అధికారులు దాడులు చేసి ఇప్పటివరకు సోనుసూద్ విరాళాల ద్వారా సేకరించిన డబ్బును కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడని మిగిలిన 18 కోట్ల రూపాయలు ఖాతాలలో ఉండిపోయాయని స్పష్టం చేశారు.
దీంతో సోనూ సూద్ ఈ విషయంపై స్పందిస్తూ కచ్చితంగా ప్రజల నుంచి సేకరించిన డబ్బు కష్టాల్లో ఉన్న వారికి అందుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చాడు.దాంతో అప్పటి నుంచి సోనూ సూద్ ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటివరకు నటుడు సోనూ సూద్ ఆస్తుల వివరాలను పరిశీలించినట్లయితే ప్రస్తుతం దాదాపుగా 130 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇందులో ముఖ్యంగా ముంబైలో సోనూ సూద్ నివాసం ఉంటున్న ఇల్లు ఖరీదు దాదాపుగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఉంటుందట.అయితే సోనూ సూద్ తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా అవుతుంది.
ఈ క్రమంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్ పూరి తదితర భాషలలో కలిపి దాదాపుగా కొన్ని వందల కుపైగా చిత్రాలలో విలన్ గా నటించాడు.అలా సినీ రంగంలో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడుతూ బాగానే లాభాలు ఆర్జించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోను సూద్ తెలుగులో ప్రముఖ దర్శకుడు “కొరటాల శివ” దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో లో ప్రధాన ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే హిందీ సినిమా పరిశ్రమలో కూడా దాదాపుగా నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.