ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరారు.దాదాపు ఐదు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది.
పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను.గురువారం.వైట్హౌస్లో కలవనున్నారు.ఈనెల 24వ తారీఖున అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ తో… వాషింగ్టన్ లో ప్రధాని మోడీ భేటీ అవుతారని భారత విదేశాంగ కార్యదర్శి పేర్కొన్నారు.
ఇరు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంతోపాటు ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు మరియు ఉగ్రవాదం నిరోధం ఇంకా ఇండో- పసిఫిక్ వాతావరణ మార్పులు వంటి వాటిపై.అమెరికా అధ్యక్షుడితో మోడీ చర్చించనున్నట్లు సమాచారం.
అనంతరం ఎల్లుండా వాషింగ్టన్లో ఆస్ట్రేలియా భారత జపాన్ అమెరికా చతుర్భుజ భద్రత కూటమి సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.ఆ తరువాత ఈ నెల 25వ తారీకు న్యూయార్క్ లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం లో.ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.అనంతరం ఆదివారం మోడీ భారత్ కి.తిరిగి రానున్నారు. జో బైడన్ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటన చేపడుతూ ఉండటంతో.
అంతర్జాతీయంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.