తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కామాంధులు అంటూ తనదైన శైలిలో పోస్టులు పెట్టారు.
లోకేష్ ఏమన్నారంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో? అని పేర్కొన్నారు.
విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణం.దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరం.వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దు.
మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి.అంటూ లోకేష్ సీరియస్ అయ్యారు.