విద్యా కానుక బ్యాగ్ లు, బూట్ల నాణ్యత పరిశీలించిన సీఎం జగన్ వచ్చే ఏడాది విద్యా కానుక కిట్ లో భాగంగా అందించినున్నా స్కూల్ బ్యాగు,బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగ్ లను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.ఇందుకు సంబంధించి అదనంగా ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది.
జగనన్న విద్యా కానుక కిట్లును విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు జతల యూనిఫాం క్లాత్ ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు స్కూల్ బ్యాగు పాఠ్యపుస్తకాలు నిఘంటువ( డిక్షనరీ) ఇస్తున్నారు.1 నుంచి 10వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్ట్ ఇస్తున్నారు.6 నుంచి 10వ తరగతి వారికి నోట్ పుస్తకాలు అందజేస్తున్నారు ఒక్కో విద్యార్థికి 6, 7 తరగతులకు 8, ఎనిమిదో తరగతి కి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటు పుస్తకాలు ఇస్తున్నారు.జగనన్న విద్యా కనుక ప్రతి విద్యార్థికి అందాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కోరికని అధికారులు పేర్కొన్నారు.