తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ హాట్ హాట్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది.డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి కెటీఆర్ కు రేవంత్ కు మధ్య మాటల తూటాలు పేలుతుండగా, ఇటు ఇతర సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చెలరేగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక వైపు, ఇటు ప్రతిపక్షాల పాదయాత్రలు, సభల, జాతీయ నాయకుల విమర్శలు తరువాత విమర్శలకు కౌంటర్ గా ప్రభుత్వం సమాధాననమివ్వడం అనేవి జరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజకీయ హడావిడి చాలా తక్కువే అయినా ఇటీవల ప్రతిపక్షాలు తమ దూకుడు తీవ్రతరం చేసిన పరిస్థితులలో పెద్ద ఎత్తున రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
అయితే ఇక ఎవరిది తప్పు , ఎవరిది ఒప్పు అనే దానిని నిర్ణయించే పరిస్థితిలో ప్రజలు ఉండరు.చివరిగా తేలేది ఏమీ ఉండదు.
ప్రజలకు జరిగే లాభం చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది.
అయితే తాజాగా డ్రగ్స్ విషయం అనేది పెద్ద ఎత్తున గత నెలరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి జరిగిన విషయం తెలిసిందే.
ఆ విషయంలో రేవంత్ రెడ్డి, కెటీఆర్ మధ్య వ్యాఖ్యలు, ట్వీట్ వార్ కొనసాగుతోంది.అయితే రానున్న రోజుల్లో రాజకీయ పర విమర్శలు మరింత తీవ్ర తరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇక రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫ్యల్యాల ఎజెండాగానే ప్రతిపక్షాల కార్యాచరణ ఉండే అవకాశం కనిపిస్తోంది.అయితే ప్రభుత్వం కూడా ఆ దిశగా అస్త్రాలను సిద్దం చేసుకొని ఉందని, విమర్శకు ప్రతి విమర్శ, మాటకు మాట ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని టీఆర్ఎస్ నుండి వస్తున్న మాట.