కేసీఆర్ తరువాత అంతటి చరిష్మా ఉన్న నేతగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ కేసీఆర్ స్టైల్ లో కాకుండా తన కంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న విషయం తెలిసిందే.ప్రజలు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ కూడా కేసీఆర్ తో సమానంగా అత్యధిక ప్రచార సభలలో పాల్గొనే అవకాశం ఉంది.కావున ఆ సమయం వరకు కేటీఆర్ స్థాయిని తగ్గిస్తే గెలుపుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నది ప్రతిపక్షాల వ్యూహాత్మక ఎత్తుగడ.
అందుకే కేటీఆర్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అంతేకాక ఈ సారి టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండే అవకాశం లేదు.
పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉంది.కావున టీఆర్ఎస్ కీలక వ్యక్తులే టార్గెట్ గా ప్రతిపక్షాల విమర్శల వ్యూహ రచన ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తన మంత్రి వర్గ పనితీరులో మాత్రం కెటీఆర్ కు మంచి మార్కులే పడ్డాయి.అయితే ఇప్పటివరకు కెటీఆర్ కు పెద్దగా రాజకీయంగా దెబ్బ తీసే విషయాలు ఏమీ లేకున్నా రాజకీయంగా కఠిన పరిస్థితులు కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ఎదురుకావడం అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కీలక మైన విషయం అని చెప్పకతప్పదు.