మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదంతో తనకున్న సర్వీసును సైతం వదులుకొని రాజకీయాలలో ప్రవేశించిన విషయం తెలిసిందే.బహుజనుల అభ్యున్నతే తన లక్ష్యమని చెబుతూ తన అనుకూల భావజాలం ఉన్న వ్యక్తులతో సమావేశమవుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఎజెండాను ఏర్పాటు చేసుకుంటున్నారు.
అయితే ఇటీవల యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డితో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమైన విషయం మనకు తెలిసిందే.అయితే వీరి సమావేశాన్ని ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోయిన పరిస్థితి ఉంది.
అయితే ఇందులో ఉన్న అసలు మతలబు ఏంటంటే యువ తెలంగాణ పార్టీ అనేది చిన్న పార్టీ అంతేకాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ.అయితే ఇరు పార్టీలకున్న బలాన్ని ఏకం చేసి కలిసి పని చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఒక వేళ హంగ్ ఏర్పడ్డా అప్పటికి వీళ్లకు దక్కిన ఎమ్మెల్యే స్థానాలే కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తుంది.కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని ఇరు పార్టీల నాయకులు ప్రత్యేక వ్యూహంతో కదులుతున్నట్టు తెలుస్తోంది.
వీరి సమావేశంపై ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉన్నా రానున్న రోజుల్లో ఇరు పార్టీల కదలికలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.