ఈ రోజుల్లో పూర్వీకుల వాడిన వస్తువులు, కరెన్సీ నోట్లు, నాణేలకు చాలా విలువుటోంది.కొందరు పాత వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటే.
మరికొందరు లక్షాధికారులు కావాలని పాత వస్తువులను వెతికి పట్టుకుంటుంటారు.వీరిలో ఎక్కువ మంది పాత నాణేలు, నోట్లు సేకరించడానికే మొగ్గు చూపుతుంటారు.
అయితే పాత నాణేలు ఒక్కోసారి లక్షల, కోట్ల రూపాయలు పలుకుతాయి.ఈరోజుల్లో కరెన్సీ పరంగా అణా పైసా కూడా విలువ చేయని నాణేలకు వేలంలో మాత్రం మంచి గిరాకీ లభిస్తుంది.
అయితే అరుదైన నాణేలను కోట్ల రూపాయలకు విక్రయించే అదృష్టం చాలా తక్కువ మందికే దక్కుకుంది.తాజాగా ఆ అదృష్టం ఒక వ్యక్తిని వరించింది.దాంతో అతడు ఏకంగా ఒక్క రూపాయి నాణెంతో రూ.10 కోట్లు సంపాదించాడు.ఈ రేంజ్ లో ఆ నాణెం ధర పలకడానికి కారణం అది చాలా అరుదైనది కావడమే.1885లో ఇండియాని బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో ఈ రూపాయి నాణేన్ని అమల్లోకి తెచ్చారు.అప్పట్లో వారు జారీ చేసిన ఈ రూపాయి నాణేన్ని ఓ వ్యక్తి భద్రంగా దాచుకున్నాడు.ఇటీవల ఓ వెబ్సైట్ లోని వేలంపాటలో తన నాణేన్ని వేలం వేసాడు.
అయితే ఇది ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడు పోయి ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా చేసింది.ఈ ఒక్క నాణెంతోనే అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.ఇకపోతే గతేడాది జూన్ నెలలో కూడా ఒక నాణెం రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది.
జూన్లో 1933 నాటి యూఎస్ నాణెం న్యూయార్క్లో వేలం వేశారు.అయితే ఈ వేలంలో ఆ నాణెం ఏకంగా 18.9 మిలియన్లకు (సుమారు రూ.188 కోట్లు) అమ్ముడుపోయింది.