టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చాలెంజ్ విసిరారు.ఇటీవల మీడియాతో చిట్ చాట్ చేసిన సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత అవసరం లేదని తెలిపారు.వచ్చే ఎన్నికలలో టికెట్లు అమ్ముకోవడానికి ఇప్పటి నుండే రేవంత్ హడావుడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
డ్రగ్స్ ఆరోపణలు.తాజా తెలంగాణ రాజకీయాల పై తనదైన శైలిలో కేటీఆర్ స్పందించారు.సీఎం ని దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.రాజద్రోహం కేసులు పెట్టడానికైనా వెనుకాడబోమని పేర్కొన్నారు.
ఇక డ్రగ్స్ ఆరోపణల పై రియాక్ట్ అయిన కేటీఆర్… అవసరమైతే ఎటువంటి టెస్ట్ కైనా తాను రెడీ అని స్పష్టం చేశారు.ఈ క్రమంలో బ్లడ్ టెస్ట్లివర్ టెస్ట్ కి శాంపిల్స్ ఇస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.ఇదే తరుణంలో తనతోపాటు రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్ట్ .చేయాలని.శాంపిల్స్ ఇవ్వడానికి తాను రెడీ, రాహుల్ గాంధీ.
రెడీనా అంటూ ఛాలెంజ్ చేశారు.ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అనే హోదా కూడా చూడకుండా ప్రతిపక్ష నాయకులు నోరు పారేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే.ఊరుకునే ప్రసక్తి లేదని.అవసరమైతే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇలపైరాజద్రోహం కేసు పెట్టే పరిస్థితి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.ఒకప్పుడు పెయింటర్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి కి ఇప్పుడు బంజారాహిల్స్ లో అనేక భవనాలు ఎలా వచ్చాయి అంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అలాగే కొత్తగా వచ్చిన పార్టీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు చిల్చడానికి వచ్చాయని.ఆరోపించారు.అందువల్లే కాంగ్రెస్ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలను ఆ కొత్త పార్టీ కి చెందిన నాయకులు విమర్శించడం లేదని పరోక్షంగాషర్మిల పార్టీపై కేటిఆర్ కామెంట్ చేయడం జరిగింది.
ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ విషయంలో కార్యకర్తలు కూడా ఎదురుదాడికి రెడీగా ఉండండి అంటూ కేటీఆర్ తెలిపారు.