తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతున్న పరిస్థితి ఉంది.సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం బీజేపీకి కనీస బలం లేకపోయింది.
కాని బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా నియామకం అయిన తరువాత బీజేపీ కొద్ది కొద్దిగా బలపడిందన్న విషయం తెలిసిందే.అయితే బండి సంజయ్ కంటే ముందు బీజేపీ లో కీలక నాయకులు అధ్యక్షులుగా పనిచేసినా వారు సౌమ్యంగా ఉండటం, పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు.
అంతేకాక బండి సంజయ్ కంటే ముందు పనిచేసిన వారు మాస్ లీడర్లుగా ఆకట్టుకోలేకపోయారు.కాని బండి సంజయ్ అధ్యక్షునిగా నియామకం అయిన తరువాత పదునైన విమర్శలతో కెసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఆ తరువాత దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో బీజేపీ మరింత బలపడింది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే పాదయాత్రను తారా స్థాయిలో ఊహించుకున్న బీజేపీకి పాదయాత్ర అంతగా విజయవంతం కాకపోవడం టీఆర్ఎస్ కూడా అసలు పాదయాత్రపై ఎటువంటి ఘాటు కామెంట్ చేసిన పరిస్థితి లేదు.రాష్ట్ర వ్యాప్తంగా స్పందన లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా లైట్ తీసుకుంది.