పెళ్లి అనేది ఎవ్వరి జీవితంలో అయినా ఒక అపురూప ఘట్టం అనే చెప్పాలి.అలంటి పెళ్లి ఇద్దరి మనుషులను ఒక్కటి చేస్తుంది.
అంతేకాదు రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది.అలంటి ఎంతో అపురూపమైన పెళ్లిని ఒక యువతీ చేసుకోనంటూ ఏకంగా సీఎం కి, పీఎం కి లేఖ రాసింది.
ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో అదే పనిగా చర్చించు కుంటున్నారు.
అసలు ఆ యువతి అలా లేఖ ఎందుకు రాసింది.
అది కూడా ఏకంగా సీఎం కి రాయడం వల్ల అందరు మాట్లాడు కుంటున్నారు.కానీ అందుకు ఒక కారణం ఉందంట.
మాములుగా అయితే ప్రజాప్రతినిధులకు ప్రజలు లేఖలు రాస్తూనే ఉంటారు.అందులో పెద్ద విశేషం ఏమి లేదు.
కానీ ఎప్పుడు ప్రజా ప్రతినిధులకు మన గ్రామానికి కావలసిన సదుపాయాల గురించి రాస్తారు.
కానీ ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ నాయకులూ ఆవాసం లేదు.
తమ సమస్యను తామే పరిష్కరించు కోవచ్చు అని ఈ యువతి నిరూపించింది.ఇంతకీ ఈ లేఖలో ఏముందా అని ఆలోచిస్తున్నారా.
ఆ యువతి ఈ లేఖలో ఏం రాసిందంటే.వాళ్ళ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదని అందువల్ల చాలా సమస్యలు వస్తున్నాయని తెలిపింది.
అంతేకాదు వాళ్ళ గ్రామానికి రోడ్డు లేక యువతులకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.విద్యార్థులు చదువు మానేస్తున్నారని.ఈ సమస్యలు పరిష్కరించకపోతే తాను పిల్లి చేసుకోను అని చెబుతూ కర్ణాటక రాష్ట్ర సీఎం తో పాటు మోడీ కి కూడా లేఖ రాసింది.ఆ యువతి పేరు బిందుశ్రీ.
ఈమె ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది.రోడ్డు లేకపోవడం వల్ల కనీసం బస్సులు కూడా రావడం లేదని అందుకే విద్యార్థులు ఉన్నత విద్యను చదవకుండా మానేస్తున్నారని ముఖ్యంగా యువతులకు పెళ్లి కావడం లేదని తెలిపింది.
ఈ యువతి రాసిన లేఖకు అధికారులు స్పందించారు.సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈ పోస్ట్ కు జిల్లా కలెక్టర్ స్పదించారు.అక్కడికి చేరుకొని వివరాలు కూడా సేకరించారు.సమస్యలు అన్ని పరిష్కరిస్తామని పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని కోరాడు.దీంతో ఈ యువతిని అందరు ప్రశంసిస్తున్నారు.మనసు ఉంటే మార్గం ఉంటుందని ఆమె నిరూపించింది.