గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపాని రాజీనామా చేయగా అనంతరం ఆ స్థానంలోకి భూపేంద్ర పటేల్ నీ … బీజేపీ పెద్దలు ఎంపిక చేసి ముఖ్యమంత్రి గా నియమించడం జరిగింది.
ఇటీవల ఉపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే కాక.క్యాబినెట్ తో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.అయితే ఇంతలోనే గుజరాత్ రాజకీయాల్లో.మరో సరికొత్త ట్విస్ట్ నెలకొంది.విషయంలోకి వెళితే ఈ రోజు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేయడం జరిగింది.
ఈ క్రమంలో రాజేంద్ర త్రివేది.
తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరికి పంపించారు.అనంతరం పరిణామాలు వేగంగా మారిపోవడంతో స్పీకర్ రాజీనామా.
అమల్లోకి వచ్చినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించడం జరిగింది.దీంతో గుజరాత్ రాజకీయాల్లో అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
రాజేంద్ర త్రివేది స్పీకర్ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటో ఇంతవరకు బయటకు తెలపలేదు.మరోపక్క రాజేంద్రకు బీజేపీ హైకమాండ్ మంత్రి పదవి ఇస్తున్నట్లు… గుజరాత్ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది.
ఇటువంటి తరుణంలో స్పీకర్ పదవి ఎవరికి కట్టబెడతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.