ఈ మధ్య అడవి జంతువులు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతోంది.అవి చేసే పనులకు ఏకంగా కొన్ని పెద్ద పెద్దపనులే ఆగిపోతున్నాయి.
ఇక మ్యాచ్ మధ్యలోకి కుక్కలు లేదంటే పిల్లలు వస్తే ఇంటర్నేషనల్ మ్యాచులు కూడా ఆగిపోతున్న సంగతి తెలిసిందే.కాగా ఇప్పుడు ఓ మొసలి ఏకంగా పట్టాలపైకి వచ్చి అటు వెళ్తున్న రైళ్లను మొత్తం ఆపేసింది.
చిత్రమైన ఘటన వడోదర-ముంబై రైల్వే ట్రాక్ మీద జరిగినట్టు తెలుస్తోంది.దీంతో అధికారులు మొత్తం అలర్ట్ అయిపోయారు.
దాన్ని తప్పించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మంగళవారం రోజు అనుకోకుండా ఈ రైల్వే పట్టాలకు అడ్డంగా గాయాలతో ఉన్న ఓ మొసలి వచ్చింది.
ఇక దీని కారణంగా ఆ ట్రాక్పై వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిపోవాల్సి వచ్చింది.ఇక ఈ రైలు వెళ్లకపోవడంతో మిగతా రైళ్లు కూడా దాదాపుగా 45 నిమిషాలు లేటుగా నడిచాయి.
ఇక ఆ మొసలిని తొలగించేందుకు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది.చాలా రకాల సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఎంతో కష్టపడి చివరకు ఆ బాయపడ్డ మొసలిని పక్కకు జరపడంతో ఆగిపోయిన రైలు మళ్లీ స్టార్ట్ అయింది.
ఈ మొసలి కర్జన్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆ ట్రాక్ మీదకు వచ్చినట్టు తెలుస్తోంది.ఇక దాన్ని తొలగించేందుకు వన్యప్రాణుల కార్యకర్త హేమంత్ వద్వాన రావాల్సి వచ్చింది.ఆయన రాగానే ఆ గాయపడ్డ మొసలికి చికిత్స చేసిన తర్వాత పట్టాలపై నుంచి పక్కకు తీసుకెళ్లారు.ఇక ఆ తర్వాత దాన్ని కిసాన్ రైలులో తరలించారు.ఇక అతను ఇంకొంచెం ఆలస్యంగా వెళ్లి ఉంటే మాత్రం ఆ మొసలి మరణించేదని చెప్పారు.కాగా ఆ మొసలి అక్కడకు అసలు ఎలా వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.
అయితే ఒక మొసలి వల్ల ఇలా రైళ్లు ఆగిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు.
.