యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.దసరా కానుకగా ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ ను సెలెక్ట్ చేసినట్టు టాక్.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న భట్ బ్యూటీ తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తుంది.
ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకోవాలని అనుకున్నారు కాని అది కుదరలేదు.
కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కాంబోలో ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.మరోసారి ఈ ఇద్దరు కలిసి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.సినిమాలో అందాల భామ అలియా భట్ కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ సరసన సీతగా నటిస్తున్న అలియా భట్ ఈసారి కొమరం భీం తో జతకడుతుంది. తప్పకుండా ఈ మూవీ భారీ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు.
ఎన్.టి.ఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు.