ఉత్తర కొరియా అదేరీతిలో దక్షిణ కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఇరుదేశాలు క్షిపణుల ప్రయోగంతో పోటాపోటీగా బలప్రదర్శనకు దిగారు.
గత కొన్ని నెలల నుండి చాలా ప్రశాంతంగా ఉన్న ఉత్తరకొరియా ఉన్నట్టుండి ఇటీవల క్షిపణుల ప్రయోగం మళ్లీ మొదలు పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.కొత్తగా తయారు చేసిన దీర్ఘ శ్రేణి క్రుయిజ్క్షిపణుల ప్రయోగం విజయవంతమైనట్లు ఉత్తరకొరియా ప్రకటించి దీనికి అదనపు గా మరో రెండు క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడం జరిగింది.
ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు జపాన్ మీదుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరంలో పడినట్లు వెల్లడించింది.ఇదే సమయంలో బలప్రదర్శనకు దక్షిణకొరియా దిగి సబ్ మెరైన్ నుండి బాలిస్తిక్ క్షిపని ప్రయోగించి.
అద్భుతంగా పని చేస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.ఈ క్షిపణి వాయుమండల దాడుల నుండి కాపాడుకోవడానికి శాంతిని నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది.
పరిస్థితి ఇలా ఉంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జొంగ్ కి బ్రిటన్ రాణి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఉత్తర కొరియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్ బాగుండాలని కోరుతూ బ్రిటన్ రాణి ఉత్తరకొరియా అధ్యక్షుడు కి లెటర్ రాయడం జరిగింది.