ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీలో పేరున్న సంగతి తెలిసిందే.అరవింద సమేత, అల వైకుంఠపురములో విజయాలతో స్టార్ డైరెక్టర్ గా తన రేంజ్ ను పెంచుకున్న త్రివిక్రమ్ పలు సినిమాలకు మాటలు కూడా అందిస్తున్నారు.
త్వరలో మహేష్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి రచయిత నివాస్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకు అరేయ్ ఒరేయ్ అనుకునే రిలేషన్ ఉండేదని ఇప్పటికి కూడా ఆ రిలేషన్ కొనసాగుతోందని నివాస్ వెల్లడించారు.
త్రివిక్రమ్ రచయిత, తను రచయిత అని ఒక వెర్షన్ రాయమని తనను నేను అడగలేనని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివ తనను అన్నయ్య అని పిలుస్తారని నివాస్ చెప్పుకొచ్చారు.
తాను సినిమాలకు పని చేస్తామంటే దర్శకులు రాయించుకుంటారని అయితే తనకు సొంతంగా సినిమాలు ఉన్నాయని నివాస్ తెలిపారు.
తన స్నేహితులు కూడా రచయితలు కావడంతో అవకాశాలు అడగలేనని నివాస్ పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో రికమెండేషన్ లు పని చేయవని ప్రతిభ ఉన్నవాళ్లనే తాను అయినా ప్రోత్సహిస్తానని నివాస్ చెప్పుకొచ్చారు.బోయపాటి శ్రీను తాను రూమ్ మేట్స్ అని భద్ర, తులసి, సింహా సినిమాలకు తాను పని చేశానని నివాస్ పేర్కొన్నారు.
భద్ర సినిమాకు స్క్రిప్ట్ పనులు తాము కూడా చేసినా కొరటాల శివకు గుర్తింపు రావాలని భావించి భద్ర సినిమాకు ఆయన పేరు వేయించామని నివాస్ వెల్లడించారు.
సింహా తరువాత తనకు వేరే సినిమాలలో ఆఫర్లు రావడంతో బోయపాటి శ్రీనుకు తాను దూరమయ్యానని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివతో తాను కలిసి పని చేస్తానన్నా ఆయన తనను వద్దనరని నివాస్ పేర్కొన్నారు.కొరటాల శివ తరువాత సినిమా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.