ఆంధ్రప్రదేష్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.కరోనా బారిన పడిన ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తక్కువగానే వస్తున్నా అక్కడక్కడ దీని ప్రభావం బాగానే ఉంది.ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత బాగానే కనిపిస్తుంది.
ఏపీలో కరోనా కేసుల వివరాలు చూస్తే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పొచ్చు.అయితే ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్ రావడం హాట్ న్యూస్ గా మారింది. బొత్స సత్యనారాయణకు కొవిడ్ పాజిటివ్ వచ్చినా సరే కరోనా తీవ్రత తక్కువగా ఉందని చెబుతున్నారు.పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.అపోలో హాస్పిటల్ లో బొత్స ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ వర్గాల నుండి వివరాలు రావాల్సి ఉంది.ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా కరోనా కేసులు అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది.
తెలంగాణాలో అయినా ఎలాంటి ఆంక్షలు లేకపోయినా ఏపీలో మొన్నటివరకు నైట్ కర్ఫ్యూ కొనసాగించారు. ఈమధ్య సెలబ్రిటీస్ కు.రాజకీయ ప్రముఖులకు కరోనా ఎఫెక్ట్ అవడం కొద్దిగా తగ్గినట్టు అనిపించగా మళ్లీ ఏపీ మంత్రి బొత్సకి కరోనా పాజిటివ్ రావడం షాకింగ్ గా ఉంది.