కరోనా కష్టకాలంలో కూడా నితిన్ వరుస సినిమాలు చేశాడు.హిట్ మీద హిట్ కొడుతూ దుమ్మురేపుతున్నాడు.పొయిన సంవత్సరం బీష్మ సినిమా చేసిన నిత్.ఈ ఏడాది చెక్ సినిమా చేశాడు.అనంతరం రంగ్ దే తో జనాల ముందుకు వచ్చాడు.తాజాగా మాస్ట్రో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతుండు.
ఈ వారంలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.తాజాగా మరో సినిమాను ప్రకటించాడు నితిన్.
ఈ సినిమా తాజా టైటిల్మా చర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని యాక్ట్ చేస్తుంది.ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నితిన్ గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట.సినిమాలో ఫుల్ లెన్త్ పొలిటిక్ డ్రామా కనిపించనుందట.
ఈ సినిమా కథ పూర్తిగా రాజకీయం చుట్టూ తిరుగుతుందట.గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో పొలిటికల్ సినిమాలు అంతగా రాలేదు.
ఈ లోటును భర్తీ చేయబోతుంది ఈ సినిమా.
తప్పకుండా ఈ సినిమా జనాలను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.అటు ఈ సినిమాలో నితిన్ పొలిటికల్ లీడర్ గా కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో కథ ఏంటి అనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తుంది.అటు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ కు ఏర్పాటు చేస్తారు? అనే విషయంపై సినీ జనాలు చర్చించుకుంటున్నారు.అటు సినిమాకు సంబంధించి కథనాన్ని ఆసక్తి కరంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.స్క్రీన్ ప్లే గతంలో ఏ సినిమాలోనూ కనిపించని రీతిలో ఉంటుందని తెలుస్తోంది.నితిన్, కృతి మధ్య అత్యంత ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను నితిన్ తండ్రి, సోదరి నిర్మిస్తున్నారు.
వచ్చే సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.