1.సౌదీ రాజు సంచలన ఆదేశాలు
అరబ్ దేశం సౌదీ అరేబియా కూడా ఇప్పుడు స్వదేశీ నినాదాన్ని వినిపిస్తోంది.తమ దేశంలో తయారైన స్థానిక ఉత్పత్తులని ప్రభుత్వ కాంట్రాక్టర్లు కొనాలని సౌదీ రాజు సూచించారు.
2.కువైట్ కు చైనా భారీ ఆఫర్
కువైట్ కు చైనా భారీ ఆఫర్ ఇచ్చింది.16 బిలియన్ డాలర్లు ( ఒక లక్షా పదిహేడు వేలు ) తప్పుగా ఇచ్చేందుకు చైనా బ్యాంక్ ముందుకు వచ్చింది.
3.బెహ్రైన్ లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించాలి
బెహరిన్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిక్కుకుని చిత్ర హింసకు గురవుతున్న ఏపీకి చెందిన తెలుగు కార్మికులను స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.
4.భారతీయులకు శుభవార్త ! అమెరికాలో కొత్త బిల్లు
అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా శుభ వార్త చెప్పింది .అమెరికా ప్రభుత్వం తాజాగా బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా ఇమిగ్రేషన్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది.
5.ఐసోలేషన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.ఆయన సిబ్బందులు ఒకరికి కరోనా సోకడంతో పుతిన్ స్వీయ ఇసోలేషన్ లోకి వెళ్ళారు.
6.క్వాడ్ సదస్సుకి అమెరికా ఆతిథ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సెప్టెంబర్ 24న జరగనున్న క్వాడ్ సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
7.విధుల్లోకి ఆఫ్గన్ పోలీసులు
తాలిబన్ల పిలుపుతో ఆఫ్గాన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు.
8.ఆఫ్గన్ కు అండగా భారత్
ఆఫ్ఘనస్తాన్ కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. .
9.ఐక్యరాజ్యసమితి ఆర్థిక సాయం
ఆహ్వానం ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి రెండు కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
10.సరిహద్దుల్లో సాయుధ రోబోలు
ఇజ్రాయిల్ మరో కొత్త ఆయుధాన్ని తయారుచేసింది సరిహద్దుల్లో భద్రత కోసం రోబోటిక్ వాహనాలను తయారు చేసింది.మనుషులు అవసరం లేకుండా సరిహద్దుల్లో పహారా కాసెందుకు వీటిని తయారు చేశారు.
.