టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి, తన నటన గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకొని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది.లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ చేస్తున్న ప్రచారం వైరల్ గా మారింది .
గత ఏడాది గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది.ఇక సోషల్ మీడియాలో తన భర్తతో దిగిన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన భర్తతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నానని తెలిపింది.దాంతో కొన్ని రోజుల సినిమాలకు బ్రేక్ చెప్పడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా బాలీవుడ్ లో ది ఘోస్ట్ అనే సినిమాను కూడా పూర్తి చేసింది.ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాయని.అందుకే ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాలని తాజాగా వార్తలు వినిపించడంతో.ఆ ఏడాదిలో తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు వినిపిస్తున్నాయి.
ఇక మరికొందరు కాజల్ త్వరలోనే శుభవార్త చెప్పడానికి సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని అంటున్నారు.కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలి అంటే కాజల్ స్పందించే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో హే సినామిక, కరుంగాపియమ్ సినిమాలను కూడా పూర్తి చేసింది.
నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.