స్మశానం అంటేనే మనలో చాలా మందికి భయం.ఆ పేరు వింటేనే కొంతమంది గడగడా వణికి పోతారు.
స్మశానం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏడుపులు, ఆర్తనాదాలు.మనం మనకు బాగా కావాల్సిన వారిని కోల్పోయినప్పుడు మాత్రమే స్మశానానికి వెళ్తాము.
అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఆ దరి దాపుల్లోకి కూడా వెళ్ళడానికి సాహసం చేయము.
పగలు కన్నా రాత్రి పూట స్మశానాలు చాలా భయంకరంగా ఉంటాయి.
దెయ్యాలు, ఆత్మలు ఉంటాయని చాలా మంది అటు వైపుకు రాత్రి పూట వెళ్ళడానికి దైర్యం సరిపోదు.కానీ దెయ్యాలు, భూతాలు అనేవి లేవని నమ్మేవారు మాత్రం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు.
అయితే ఇప్పుడు స్మశానం గురించి చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది.
ఏంటంటే.
ఒక మహిళ స్మశానంలో విచిత్రంగా కనిపిస్తూ అక్కడ తిరుగుతూ స్థానిక ప్రజలను షాక్ కు గురి చేస్తుంది.ఆమెను చుస్తే వెంటనే దడుచుకోవడం ఖాయం.
ఎందుకంటే ఆమె తన కాస్ట్యూమ్ కూడా సేమ్ దెయ్యంలాగా వేసుకుంది.
ఆమె అలా తిరుగుతూ ఉంటె అక్కడి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.ఎందుకు అలా చేస్తుందో అర్ధం కాలేదు వారికీ.అయితే ఆమె ఒక సన్యాసి అని తెలుస్తుంది.
ఈ ఘటన యుకె లో జరిగింది.అక్కడ ఒక స్మశానంలో మిట్ట మధ్యాహ్నం ఒక సన్యాసిని అస్థిపంజరంతో ఆడుకోవడం.డాన్స్ చేయడం వంటివి ఆ స్మశానం పక్కన రోడ్డు మీద వెళ్తున్న వారు చూసి షాక్ అయ్యారు.ఒక వ్యక్తి ఈ ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగ అవి కాస్త వైరల్ అయ్యాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఒంటరిగా స్మశానానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక ఆస్థి పంజరంలో ఆడుకుంది.
ఈమె చేస్తున్న పనులను చుసిన కొంతమంది అటుగా వెళ్తూ ఆమె చేస్తున్నదంతా కాసేపు నిలబడి మరి చూశారట.ఆమె తెల్లని దుస్తులు వేసుకుని తల మీద టవల్ కూడా వేసుకుంది.అయితే ఇదంతా చూసిన నెటిజెన్స్ ఆమె మానసిక స్థితి బాగాలేదని అనుకుంటున్నారు.
ఈ స్మశానం గత 50 సంవత్సరాలుగా మూసేసి ఉంచారట.మరి ఆమె ఎందుకు ఆలా చేస్తుందో ఎవ్వరికి అంతు పట్టడం లేదు.