తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చాలా ఆసక్తికరంగా రంజుగా సాగుతున్న విషయం తెల్సిందే.అప్పుడే మొదటి వారం ముగించుకుని రెండవ వారంలోకి అడుగు పెట్టింది.
అదుగో ఇదుగో అంటూనే అప్పుడే రెండవ వారంలోని ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ జరిగింది.ఈ పక్రియలో భాగంగా ఇంటి సభ్యులను నక్క మరియు గద్ద ల టీమ్ లుగా ఎంపిక చేయడం జరిగింది.
ఈ రెండు టీమ్ లు అవతలి వారిని ఎలిమినేషన్ కు నామినేట్ చేయాల్సి ఉంటుంది.ఇంటి సభ్యులు మొత్తం ఈసారి ఏడుగురు సభ్యులను ఎలిమినేట్ చేసేందుకు నామినేట్ చేయడం జరిగింది.
ఏడుగురిలో ఉమా, ప్రియ, ప్రియాంక, నటరాజ్, యానీ, లోబో మరియు కాజల్ లు నామినేట్ అయ్యారు.ఈ వారం వీక్ కంటెస్టెంట్స్ లో ఉమా ముందు ఉంటారు అంటూ అప్పుడే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఉమ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి.ఇక ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ సమయంలో నటరాజ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాస్త విచిత్రంగా విడ్డూరంగా అనిపించాయి.
తనను తొక్కేసేందుకు ఒక గుంట నక్క మేక వేశంలో హౌస్ లో అడుగు పెట్టింది.ఆ గుంట నక్క మరి కొందరిని ఉసిగొల్పి నామినేట్ చేసేలా చేసింది.
నేను ఆ విషయం చూసుకుంటాను అంటూ బిగ్బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ ఛాలెంజ్ చేశాడు.అయితే మాస్టర్ గుంట నక్క ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.ఆ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాస్టర్ కు ఉంది.కాని ఆయన మాత్రం ఆ విషయంలో స్పందించడం లేదు.టైమ్ వచ్చిన సమయంలో ఆయన చెప్తాను అంటున్నారు.దాంతో సోషల్ మీడియా జనాలు ఎవరికి తోచినట్లుగా వారు పేర్లు ఊహించేసుకుంటున్నారు.
ఈ విషయంలో ఎవరి వాదన వారిది.చివరకు ఏం జరుగుతుందో చూడాలి.