నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.గత ఏడాది నుండి ఈ సినిమా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తుంది.
కరోనా వల్ల సినిమా ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.మొన్నటికి మొన్న వినాయక చవితి సందర్బంగా విడుదల చేస్తామంటూ వాయిదా వేశారు.
ఎట్టకేలకు సినిమా విడుదల తేది విషయంలో క్లారిటీ వచ్చింది.ఖచ్చితంగా వచ్చే వారంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.
అయితే ట్రైలర్ చూసిన తర్వాత అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఈ సినిమా లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు.అంటే తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేనటువంటి క్లైమాక్స్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు లో చాలా పవరువు హత్యల కు సంబంధించిన సినిమా లను చూడటం జరిగింది.లవ్ స్టోరీ కూడా పరువు హత్య సినిమానే అంటున్నారు.హీరోయిన్ తండ్రి ఈ సినిమాలో అత్యంత రాక్షసంగా చివర్లో హీరోయిన్ ను చంపిస్తాడని వార్తలు వస్తున్నాయి.ఇటీవల కాలంలో తెలుగు సినిమా ల్లో పరువు హత్యలను చూస్తున్నాం.
వాటిలో కొన్నింటిని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకున్నారు.కాని పెద్ద హీరో హీరోయిన్ అయిన నాగచైతన్య మరియు సాయి పల్లవి వంటి స్టార్స్ నటించిన సినిమా లో పరువు హత్య ను యాంటీ క్లైమాక్స్ ను ప్రేక్షకులు జీర్ణించుకోలేరేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పరువు హత్య విషయంలో చాలా మంది చాలా రకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు.ఈ సినిమా లో అలాంటిది ఏమీ లేదని కొందరు సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఓ రేంజ్ లో పరువు హత్యకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.ఇదే కనుక నిజం అయితే సినిమా ఫలితంపై ప్రభావం పడుతుందని అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.