ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రియ. అతి తక్కువ టైమ్ లోనే దేశవ్యాప్తంగా టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది.
సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది సంవత్సరాల క్రితం ఆండ్రీ కొశ్చేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా శ్రియ దంపతులు ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రేయ కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి రాలేకపోయిన స్వామివారిని దర్శించలేక పోయినట్లు.
పేర్కొన్నారు.ప్రస్తుతం శ్రియ “RRR” తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.