దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బిజెపి పార్టీపై వ్యతిరేకత కనబడుతూ ఉండటంతోపాటు సర్వే ఫలితాలు కూడా అదేరీతిలో వస్తూ ఉండటంతో యుపి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్.
యూపీ ఎన్నికలలో గెలిచి దేశవ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం.కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.
దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని.కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి ప్రియాంకగాంధీ రెడీ అవుతున్నట్లు.వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా.ఆమె అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ రెడీ అవటంతో యూపీ రాజకీయాలు సంచలనంగా మారాయి.ఏది ఏమైనా బిజెపిని ఓడించాలని ప్రతిపక్షాలు.కంకణం కట్టుకున్నాయి.కరోనా కట్టడి చేయడంలో అదేరీతిలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేయడం వంటి వాటి పై వ్యతిరేకత వస్తున్న తరుణంలో.
ఇదే సరైన టైం అని కాంగ్రెస్ భావిస్తూ బీజేపీని దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు వేస్తూ ఉంది.దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.