టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు.వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
చిరుత సినిమాతో సినీ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రామ్ చరణ్ ప్రాజెక్టుల ఎంపిక ఉండటం గమనార్హం.2004 సంవత్సరంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రామ్ చరణ్ తొలిసారి మైక్ పట్టుకుని మాట్లాడారు.తాను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదని నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నానని రామ్ చరణ్ అన్నారు.18 సంవత్సరాల వయస్సులో తొలిసారి రామ్ చరణ్ పబ్లిక్ ఈవెంట్ కు హాజరై సందడి చేశారు.
చరణ్ తొలి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రెండో సినిమా తెరక్కింది.
చరణ్ నటించిన మగధీర సినిమా బడ్జెట్ 40 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా రెట్టింపు కలెక్షన్లను సాధించడం గమనార్హం.దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించడం కోసం ఎంతో శ్రమించారు.రెండో సినిమాతోనే చరణ్ ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసి శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారు.ఆచార్యలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా శంకర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు.రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటన వెలువడాల్సి ఉంది.