ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల పై తునికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 17 పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్ అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
దాదాపు లీటర్ పెట్రోల్ లో పావు లీటర్ దోచేసుకునే రీతిలో మైక్రోచిప్ విధానం ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు.ప్రజల వద్ద డబ్బులు దోచేస్తున్నట్లు గుర్తించారు.
టెక్నాలజీ ట్యాంపరింగ్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో దాదాపు 600 పెట్రోల్ బంకులలో తూనికల కొలతల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
చాలా పెట్రోల్ బంకుల్లో మైక్రోచిప్ విధానం ద్వారా ఏకంగా లీటర్ పెట్రోలు లో పావు లీటర్ దోచేస్తున్నట్లు అధికారులు కనిపెట్టారు.మైక్రో చిప్ అమర్చి వినియోగదారుల కళ్ళముంద.
డబ్బులతో దోచేస్తున్న పెట్రోల్ బంకుల పై కేసులు నమోదు చేయడం జరిగింది.ఒకవైపు భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరోవైపు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మైక్రోచిప్ విధానం ద్వారా.
దోచేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.