ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా శ్రీనివాస్ రెడ్డి కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తున్నటువంటి ‘ప్లాన్ బి’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇందులో శ్రీనివాస్ రెడ్డి సరసన డింపుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ‘ప్లాన్ బి’ చిత్రం ఎంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ క్రమంలోనే పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17 వ తేదీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ప్లాన్ బీ చిత్రం గురించి మాట్లాడుతూ.థియేటర్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రెండు గంటలపాటు ఎంతో సస్పెన్స్ థ్రిల్లింగ్ గా గురిచేస్తుందని తెలియజేశారు.ఈ చిత్రంలో మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించారు.సెప్టెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకురాబోతున్న శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ బి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.