ఈరోజు తెలంగాణ భాష ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.ప్రజా కవి పద్మవిభూషన్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ మాతృభాష స్ఫూర్తికి అదేరీతిలో సంస్కృతికి కాళోజీ ఆదర్శప్రాయుడని కొనియాడారు.ముఖ్యంగా కాళోజీ తెలంగాణ భాష సాహిత్యానికి ఎంతో అస్తిత్వ స్పృహ ను అందించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇక ఇదే తరుణంలో తెలంగాణ పీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కాళోజి సిద్ధాంతా లు రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన ఆశయాలను.అమలు చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అస్తిత్వాన్ని అదే రీతిలో సాహిత్య భాషా రంగాలలో కాళోజి చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎవ్వరు మర్చిపోలేనివి అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కీలక టైంలో ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకాతరిమి కొడతాం ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోని పార్టీ పెడతాం అని అప్పట్లో ఇచ్చిన నినాదం.