అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కి వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వచ్చే నెల 8వ తేదీన రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమాలో సమంత ఆత్మ నటిస్తున్నారని సమాచారం.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన సమంత సినిమాలకు డబ్బింగ్ చెప్పే చిన్మయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సమంత చాలా సందర్భాల్లో తనకు స్టార్ స్టేటస్ రావడానికి చిన్మయి కారణమని వెల్లడించిన సంగతి తెలిసిందే.
బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన పాత్ర నచ్చడంతో చిన్మయి ఈ కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇప్పటికే రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అఖిల్ సినిమాతో తొలిసారి స్క్రీన్ పై కనిపించనున్న చిన్మయి ఆ సినిమాతో సక్సెస్ సాధిస్తే మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు అఖిల్ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న హిట్ ఈ సినిమాతో దొరుకుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది.
నాగచైతన్య లవ్ స్టోరీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ సొంతమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు పూజా హెగ్డే టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరును సంపాదించుకోగా అఖిల్ కు పూజా సక్సెస్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.కొత్త తరహా కథాంశంతో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతోందని తెలుస్తోంది.