ఈ మధ్య సోషల్ మీడియాను ఓ సాంగ్ ఊపేస్తోంది.ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది.
ఇంకా చెప్పాలంటే దునియాలో దుమ్ము లేపుతూ దూసుకెళ్తోంది.ఇంటర్నెట్ ను షేక్ చేసే స్థాయిలో ఆ పాట ఉంది.
ఆ పాటకు ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారంటూ చాలు ఇట్టే వైరల్ అయిపోతుంది.చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఈ పాటకే కాలు కదుపుతున్నారు.
మరి ఈ పాట వింటే వచ్చే ఉత్సాహం అలా ఉంటుంది మరి.మరీ ముఖ్యంగా పెళ్లి బరాత్ లలో ఈ పాట లేకుండా అస్సలు ఉండట్లేదు చాలామంది.
పండుగ ఏదైనా పాట కామన్ అన్నట్టు అయిపోయింది.
ఈ పాటకు ఇంత క్రజ్ వచ్చిందంటే కారణం మాత్రం మొన్న పెళ్లి బరాత్లో వధువు సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ అనే చెప్పాలి.
ఆమె చేసినప్పటి నుంచే ఈ పాట ఉర్రూతలూగుతోంది.ఎక్కడ చూసినా ఇదే పాట వైరల్ అవుతోంది.అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటున్నారంటే దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇక అప్పటి నుంచి ప్రతి ఫంక్షన్ కూడా బుల్లెట్ బండి పాటతో మార్మోగుతోంది.
ఇక మొన్నటికి మొన్న టీఆర్ ఎస్ ఎంపీ మాలోతు కవిత కూడా ఇదే పాటపై డ్యాన్స్ చేయగా వైరల్ అయింది.
అయితే ఇప్పటి వరకు అమ్మాయిలే ఈ పాటకు డ్యాన్స్ చేస్తుంటే మనం చూశాం.కాగా ఇప్పుడు తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి రాజయ్య చేస్తే ఎలా ఉంటాది.ఓ లెవల్ అంటారు కదా అచ్చం అలాగే ఉంది ఆయన డ్యాన్సు వీడియో.
అదేంటంటే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిన్న ఆయన నియోజకవర్గంలోని చిలుపూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామానికి వెళ్లారు నిన్న.కాగా ఆ ఊరిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన తర్వాత ఓ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలతో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు.
దీంతో ఆ వార్త కూడా హల్ చల్ చేస్తోంది.