మరో రెండు రోజుల్లో బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రసారం కానుంది.ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5కు ఫైనల్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
బుల్లితెరపై అత్యధిక రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఈ షో ఆకట్టుకోవడం గమనార్హం.
16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారని నిన్నటివరకు ఎంపికైన కంటెస్టెంట్లు క్వారంటైన్ లో ఉండగా నేటి నుంచి బిగ్ బాస్ షో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.ఆదివారం ఎపిసోడ్ లోనే అందరు కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.
అయితే ఎంపికైన కంటెస్టెంట్లలో ఐదుగురు కంటెస్టెంట్లు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
ఐదుగురు కంటెస్టెంట్లకు వారానికి 40వేల రూపాయల నుంచి లక్షల్లో పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది.
భారీ పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్లలో యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్, ప్రముఖ సినీ నటి ప్రియ, కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఉమాదేవి, అనీ మాస్టర్, స్టార్ యాంకర్ రవి ఉన్నారని తెలుస్తోంది.
అయితే ఈ ఐదుగురు నిజంగానే బిగ్ బాస్ షోలో పాల్గొంటారో లేదో తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు ఆగాల్సిందే.బిగ్ బాస్ షోకు ఎంపికైన కంటెస్టెంట్ల జాబితాలో సరయు, నటరాజ్ మాస్టర్, సిరి హనుమంత్, ఆర్జే కాజల్, శ్రీరామ్, లోబో, ప్రియాంక సింగ్, మాసస్, మరికొందరు ఉన్నారని తెలుస్తోంది.ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
బిగ్ బాస్ షోకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ వస్తాయని నాగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.