కేంద్ర మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు..!!

ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఢిల్లీలో వెలుగొండ ప్రాజెక్టు అంశంపై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నీ కలవడం జరిగింది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో వెంటనే వెలిగొండ ప్రాజెక్టు ను గెజిట్ లో చేర్చాలని స్పష్టం చేశారు.

 Tdp Mlas Met Union Minister About Veligonda Project, Veligonda Project,tdp Mlas,-TeluguStop.com

రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు అప్పట్లో ఇచ్చినట్లు తాజాగా కేంద్ర మంత్రికి గుర్తు చేయడం జరిగింది.

ఇదే సమయంలో ప్రకాశం జిల్లా కి సంబంధించి తాగునీటి సమస్యలు అదేరీతిలో కరువు కాటకాలు గురించి కేంద్రమంత్రికి టీడీపీ నాయకుల బృందం తెలియజేయడం జరిగింది.

కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతల బృందం తాము వివరించిన సమస్యల పట్ల.మంత్రి సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.కేంద్ర మంత్రిని కలిసిన టిడిపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఇంకా కొంతమంది నాయకులు.ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube